Tuesday, 26 January 2021

టీమిండియాను ఓడించాలంటే ?

 


భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం బుధవారం ఇంగ్లాండ్ టీమ్‌కి ఇక్కడికి రాబోతోంది. ఫిబ్రవరి 5 నుంచి వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఇంగ్లాండ్ ఆడనుండగా.. ఆ జట్టు విజయవంతంగా శ్రీలంక టూర్‌ని ముగించుకుని ఉత్సాహంతో వస్తోంది. గాలె వేదికగా సోమవారం శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ని 2-0తో గెలిచిన ఇంగ్లాండ్ టీమ్.. ఆతిథ్య జట్టుకి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. భారత్‌పైనా అదే తరహాలో తాము ఆడతామని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ధీమా వ్యక్తం చేశాడు.



‘‘శ్రీలంక జట్టుని దాని సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేయడం ఇంగ్లాండ్ టీమ్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లోనూ అత్యుత్తమంగా ఆడతాం. అలా ఆడితేనే టీమిండియాని ఓడించగలం. ఎందుకంటే.. సొంతగడ్డపై భారత్ జట్టుకి టెస్టుల్లో తిరుగులేదు. అయితే.. ఇంగ్లాండ్ టీమ్ ఇప్పుడు వారికి సవాల్ విసిరే పొజీషన్‌లో ఉంది. భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండనుండటంతో.. కేవలం మూడు రోజులు మాత్రమే ప్రాక్టీస్‌కి అవకాశం ఉంది. కాబట్టి.. ఆ మూడు రోజులే మాకు కీలకం’’ అని జోరూట్ వెల్లడించాడు.